30, మే 2011, సోమవారం

కొత్తజంటకు స్వస్తివాచకాలు

మా మరదలు చి.సీతామాధవి వివాహం చి.సీతారామారావుతో తిరుమలలో మే 27న జరిగినది. ఆ సందర్భంగా చదివిన ఆశీర్వచన పద్యం.

తిరుమల వేంకటేశ్వరుడు దీవెనలిచ్చుత క్రొత్తజంటకున్
స్థిరమగు నూత్న జీవనము శ్రీలును సంతతి వంశవృద్ధియున్
వర యలివేలుమంగ యిడు వైభవ సంపద శాంతిసౌఖ్యముల్
విరియుత సంతసంబులిక వీరలజీవనమందు నిత్యమున్
||